

జనం న్యూస్ మే 29 అమలాపురం
అమలాపురం కాలేజీ రోడ్ నందు యెoడూరి రాఘవ నాగేశ్వరరావు బ్లడ్ సెంటర్ ను 28వ తేదీ బుధవారం ఉదయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ దుర్గారావు దొర ప్రారంభించారు బ్లడ్ సెంటర్ నందు గల వివిధ విభాగాలను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు కంచర్ల వేంకట్రావు (బాబి), ఉపాధ్యక్షుడు పోశెట్టి సూరిబాబు, వాణిజ్య విభాగం చైర్మన్ లక్కీoశెట్టి బాబులు, యెoడూరి వేంకట్రామయ్యలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల బాబి, ఉపాధ్యక్షులు పోశెట్టి సూరిబాబులు, రక్తదానాన్ని చేశారు ఈ యొక్క
బ్లడ్ సెంటర్ కోనసీమ జిల్లాలో ఇంతవరకు లేని అత్యాధునిక కంప్యూటర్ పరికరాలతో నూతన టెక్నాలజీతో ఏర్పాటు చేయడం జరిగింది ఈయొక్క బ్లడ్ సెంటర్ నందు ఓల్ బ్లడ్, ఎర్రరక్త కణాలు, ప్లాస్మా, ప్లేట్లెట్స్,
లోకో సైట్, సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్, సింగిల్ డోనర్ ప్లాస్మా వంటివి అత్యంత అనుభవజ్ఞులైన పాతాలజిస్ట్, మెడికల్ ఆఫీసర్లు, టెక్నీషియన్ల పర్యవేక్షణలో ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా నడపబడుతుందని బ్లడ్ సెంటర్ నిర్వాహకులు యెoడూరి రాఘవ నాగేశ్వరరావు లు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని ప్రముఖ డాక్టర్లు పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

