

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ షకిల్
జనం న్యూస్ మే 29 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
సిర్పూర్ టీ మండలం లోగురువారం రోజున నూతన తహసీల్దార్ రహీముద్దీన్ కి ఘన స్వాగతం పలకి సన్మానించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ షకీల్ అనంతరం ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ తహసీల్దార్ రహీముద్దీన్ మన ప్రాంతానికి రావడం మనందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించింది. వారి అనుభవం, నిబద్ధత ప్రజలకు సేవ చేయాలనే తపన మన ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని మేము నమ్ముతున్నాము. భూ సమస్యల పరిష్కారం, రెవెన్యూ కార్యకలాపాలు, ప్రభుత్వ పథకాల అమలు వంటివి సజావుగా సాగి, ప్రజలకు మరింత చేరువవుతాయని ఆశిస్తున్నాము. మన ప్రాంత ప్రజల సమస్యలను అర్థం చేసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తారని, అందరికీ న్యాయం చేకూరుస్తారని మేము విశ్వసిస్తున్నామ ఈ కొత్త బాధ్యతలలో విజయం చేకూరాలనిఆశిస్తున్నాము .అని తెలిపారు ఈ కార్యక్రమం లో మాజీ వార్డు సభ్యులు సోషల్ వర్కర్ ఇఫ్ఫాత్ హుసేన్, సియాసత్ స్టాఫ్ రిపోర్టార్ అబ్దుల్ జమీల్ తదితరులు పాలుగోన్నారు.