

జనంన్యూస్. 30. నిజామాబాదు.ప్రతినిధి.
జిల్లాలో మంత్రి లేకపోవడం. ఇన్చార్జి మంత్రితో ఇంకెన్నాళ్లు.. పూర్తిస్థాయిలో మంత్రిని ఎప్పుడు నియమిస్తారు.. రైతుల గోడు ఎవరికి చెప్పుకోవాలి.. ఎవరు తీరుస్తారు..ఉమ్మడి నిజామాబాదు జిల్లాలో కొన్ని గ్రామాలలో సమయాననికి వడ్లు కొనుగోలు చేయకపోవడం వలన ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో రైతన్నల బ్రతుకు ఆగమాయిపోయీనది అరుకాలం కస్టపడి పండించిన పంట కళ్ళముందే కలగర్భం లో కలిస్తే ఎమ్ చేయాలో దిక్కు తోయని స్థితిలో రైతన్నల బతుకులు ఆగమైపోయినయీ. అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకుడు. రావూట్ల బాబన్న . ఆధ్వర్యంలో సిపిఐఎం మాస్ లైన్ డివిజన్ నాయకుడు నరేందర్. తదితరులు జిల్లాకు వచ్చిన ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి తమ గోడు వినిపించారు. తడిసిన ధాన్యాన్ని తీసుకోమంటే రైస్ మిల్ యజమానులు 15 కిలోల తరుగు తీస్తామని డిమాండ్ చేస్తున్నారని మంత్రికి విన్నవించారు. జిల్లాలోని కొన్ని రైస్ మిల్లరుల పేర్లను వాటి ట్రాక్ సీట్లను మంత్రి ముందు ఉంచారు. మంత్రి ఇప్పటికైనా స్పందించి జిల్లాలోని రైతులకు తక్షణమే న్యాయం చేయులని ఏఐయుకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్. కార్యదర్శి కే దేవారం. జిల్లా అధ్యక్షుడు ఎస్ సురేష్.ప్రభుత్వన్ని డిమాండ్ చేసారు.