Listen to this article

జనం న్యూస్ 30 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

చీపురుపల్లిలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. DSP రాఘవులు వివరాల ప్రకారం… కిశోర్‌ అనే వ్యక్తి వంగర శ్రీను, నాజిల్‌ బాబు, శ్యామ్‌కు రాడ్‌ను అందించాడు. ఈ ముగ్గురు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న ఇద్దరు మహిళలపై దాడి చేసి చోరీకి తెగపడ్డారు. సాంకేతిక సాయంతో ఈ ముఠాకు చెందిన 10 మందిలో 8 మందిని గురువారం అరెస్ట చేశారు. వీరి నుంచి 5 తులాల బంగారం, 8 సెల్‌ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు.