

జనం న్యూస్ 30 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
చీపురుపల్లిలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. DSP రాఘవులు వివరాల ప్రకారం… కిశోర్ అనే వ్యక్తి వంగర శ్రీను, నాజిల్ బాబు, శ్యామ్కు రాడ్ను అందించాడు. ఈ ముగ్గురు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఇద్దరు మహిళలపై దాడి చేసి చోరీకి తెగపడ్డారు. సాంకేతిక సాయంతో ఈ ముఠాకు చెందిన 10 మందిలో 8 మందిని గురువారం అరెస్ట చేశారు. వీరి నుంచి 5 తులాల బంగారం, 8 సెల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు.