Listen to this article

జనం న్యూస్ మే30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం 14 రకాల పంటలకు మద్దతు ధర పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేసి ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం 14 రకాల పంటలకు మద్దతు ధర ప్రకటించడం పట్ల బిజెపి రాష్ట్ర కౌన్సిలింగ్ నెంబర్ రాయరాకుల మొగిలి హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ఇప్పటికే రైతులకు అండగా నిలిచిందని మరోసారి రైతుల కష్టాలను గుర్తిస్తూ 14 రకాల పంటలకు 2025, 26 వరకు మద్దతు ధర ప్రకటించారని అన్నారు. ప్రస్తుతం వరి పంటకు క్వింటాల్ కు ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 2320 ఉండగా కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ 69 మద్దతు ధర ప్రకటించడంతో రూ. 2389 పెంచారని . ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి అండగా నిలిచిందని ప్రస్తుతం మద్దతు ధర ప్రకటించడం వారికి ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు…..