Listen to this article

జనం న్యూస్- మే 30- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ :–

నాగార్జునసాగర్ పరిధిలో నకిలీ విత్తనాలు అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని విజయపురి టౌన్ ఎస్సై సంపత్ గౌడ్ తెలిపారు, వర్షాలు ప్రారంభమై రైతులు వ్యవసాయ పనులు మొదలు చేయడంతో నాగార్జునసాగర్ చుట్టుపక్కల గ్రామాలు తండాల నుంచి రైతులు విత్తనాలు ఎరువుల కొనుగోలు కోసం సాగర్ కు వస్తున్న నేపథ్యంలో నందికొండ మున్సిపాలిటీ లోని పైలాన్ కాలనీ లో ఉన్న ఓబుల్ రెడ్డి కి చెందిన విత్తనాల మరియు ఎరువుల దుకాణంలో టౌన్ ఎస్ఐ సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో విజయపురి టౌన్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు, తెనాలి ఎరువులకు సంబంధించిన స్టాక్ ను రికార్డులను పరిశీలించారు, ఈ సందర్భంగా టౌన్ ఎస్ఐ సంపత్ గౌడ్ మాట్లాడుతూ నకిలీ మందులు విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. విత్తనాలు, ఎరువులు ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయించరాదని బిల్లును తప్పనిసరిగా రైతులకు ఇవ్వాలని తెలిపారు. నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మిన వారిపై పది సంవత్సరాల వరకు జైలు శిక్ష, పిడి యాక్ట్ నమోదు తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.