

మొదటి విడతలో 2047 మంది లబ్ధిదారులకు ఇళ్ళ మంజూరు
నియోజకవర్గం వ్యాప్తంగా 3500 ఇళ్ల మంజూరు..
లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలి..
జనం న్యూస్ మే 30
సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు మండలం చిన్న కంజర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారుడి గృహ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు లేనినిరుపేదలకు సొంత స్థలం ఉంటే ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ సొంతింటిని నిర్మించడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని తెలిపారు.నియోజకవర్గం వ్యాప్తంగా 3500 ఇల్లు మంజూరు అయ్యాయని తెలిపారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని గుర్తించిలబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. పూర్తి పారదర్శకతతో రాజకీయాలకు అతీతంగా అర్హులకే వీటిని కేటాయించడం జరిగిందని స్పష్టం చేశారు.ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని దుర్వినియోగం చేయకుండా ఇళ్లను నిర్మించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్ల కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దని కోరారు. మొదటి విడతలో 2047 మంది లబ్ధిదారులకు ఇల్లుమంజూరయ్యాయని తెలిపారు. ఇళ్ల నిర్మాణ దశకు అనుగుణంగా నిధులు విడుదల అవుతాయని తెలిపారు. చిన్న కంజర్ల గ్రామంలో 65 మంది లబ్ధిదారులకు ఇల్లుమంజూరయ్యాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ రంగారావు, ఎంపీడీవో యాదగిరి, గృహ నిర్మాణ శాఖ డిఈ రవీందర్, గ్రామీణ నీటిపారుల శాఖ డిఈ శ్రీనివాస్, గ్రామ మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకట్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.