

వినియోగదారుల మన్ననలు పొందాలి.
జైనూర్ మార్కెట్ కమిటి చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్ రావ్
జనం న్యూస్ 30 మే : కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రక్ట్ స్టాఫ్ఫర్.
జైనూర్ : యువత ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం కోసం వేచిచూసి సమయాన్ని వృధా చేసుకోకుండా తమకున్న నైపుణ్యాన్ని ఉపయోగించి స్వయం ఉపాధిలో రాణించాలని
జైనూర్ మార్కెట్ కమిటి చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్ రావ్ జైనూర్ సిఐ రమేష్ అన్నారు. గురువారం జైనూర్ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్
ను మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వినియోగదారులకు నాణ్యత, నమ్మకమైన సేవలందించి వారి మన్ననలు పొందినప్పుడే వ్యాపారం అభివృద్ధి చెందుతుందన్నారు. తాను ఉపాధి పొందుతూ ఇతరులకు ఉపాధి కల్పిస్తున్న వాటర్ ప్లాంట్ యాజమాన్యంను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.