

జనం న్యూస్:30 మే శుక్రవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;
సిద్దిపేట పట్టణం శివాజీ నగర్ లోని బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యంలో మూడు రోజుల (30- 31-జూన్1st) పాటు వేసవి శిబిరం నిర్వహిస్తున్నారు, ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వేసవి శిబిరం మొదటి రోజున తెలంగాణ డెంటల్ హాస్పిటల్ డాక్టర్. అరవింద్ కుమార్ సంరక్ష హాస్పిటల్ డాక్టర్. శ్రవణ్ కుమార్, డెర్మటాలజిస్ట్ డాక్టర్. అలేఖ్య మరియు చేతిరాత నిపుణులు ఎజాజ్ అహ్మద్ ముఖ్య అతిథులుగా పాల్గొని పిల్లలకు నైతిక విలువలు, ఆరోగ్య సూత్రాలను తెలియజేశారు అనంతరం బ్రహ్మా కుమారీస్ సంస్థ నిర్వాహకురాలు బి కే భవాని మాట్లాడుతూ పిల్లలు రోజు ధ్యానం చేయాలి, చక్కని విలువలు నేర్చుకుని చదువులో, అన్ని రంగాలలో ముందుకెళ్లాలని తెలియజేస్తూ అథిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన, కేక్ కట్ చేసి శిబిరం ను ఘనంగా ప్రారంభోత్సవం చేశారు అనంతరం అతిధులకు శాలువాలను కప్పి ఈశ్వరీయ కానుకను అందించారు, ఈ కార్యక్రమంలో నైనిక, మనస్విని మరియు బృంద నృత్యంలో పాల్గొని డివోషనల్ స్పిరిట్చువల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో అవార్డు గెలుచుకున్న ఆశ్రిత అనే చిన్నారులు అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనతో అలరించారు, ఇంకా రెండు రోజుల శిబిరంలో సైన్స్ ప్రాక్టికల్ సాజిద్ అలీ సార్ అమరేందర్ రెడ్డి మోరల్ వాల్యూస్, రాజ్ కుమార్ వర్మ తెలుగు ప్రాముఖ్యతను, పిల్లల మానసిక శక్తి కి ఆధ్యాత్మికత ఆవశ్యకతను తెలియజేసే ఓంకార్ మొదలగు వారిచే వివిధ అంశాలు మరియు పిల్లలకి మాదకద్రవ్యాలు, పొగాకు నిషేధం గురించి, జాతీయ హీరోల ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహిస్తున్నాము , సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కళాంజలి రాజేశం, జబర్దస్త్ ఫేమ్ ప్రార్ధిని బృందం యొక్క ప్రదర్శన, మిమిక్రీ, వెంట్రిలాక్విజం, మ్యాజిక్ నిపుణులు రమేష్ ప్రదర్శనలు, ప్రాక్టికల్ అనుభవాలతో నీతి కథలు ఉంటాయి ఈ కార్యక్రమంలో పిల్లలందరూ ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారు సంస్థ ప్రతినిధులు బి కే స్వప్న బికే. స్రవంతి, సంస్థ సభ్యులు ఓంకార్, బిందు, డా.ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.