Listen to this article

జనం న్యూస్ మే 30 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్ర అధ్యక్షులుగా దరువు అంజన్న


రాష్ట్ర చైర్మన్ గా అన్వోజు వెంకటేష్


వర్కింగ్ ప్రెసిడెంట్ గా నకరికంటి కిరణ్

తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఆడి పాడి తెలంగాణ రావడంలో కీలక పాత్ర వహించింది కళాకారులే అని చైర్మన్ గా ఎన్నికైన అనూవొజు వెంకటేష్ అన్నారు, హైదరాబాదులో జరిగిన రాష్ట్రస్థాయి విస్తృత స్టాయి సమావేశంలో రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరిగింది, అధ్యక్షులుగా ఎన్నుకోబడిన ప్రజా ఉద్యమకారుడు, ఉస్మానియా ఉద్యమ ధీరుడు దరువు అంజన్న మాట్లాడుతూ తెలంగాణ లొ కళాకారులకు పెద్దపీట వేస్తానని ప్రగల్బాలు పలికిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఐదు వందల మందికి ఉద్యోగాలు కల్పించి మిగతా అసలైన కళాకారులకు అన్యాయం చేసిందని, పది సంవత్సరాలుగా ఏండనకా,వాననక ఉద్యమాలు కొనసాగిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వహించిందని, కనీసం ఇప్పుడు ఏర్పడిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు కల్పించి వారి జీవితానికి భరోసా కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు, వర్కింగ్ ప్రెసిడెంట్ నకరెకంటి కిరణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మాట నిలుపుకోవాలని నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని అన్నారు, ఈ సందర్భంగా కమిటీని ప్రకటించారు, తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం. రాష్ట్ర అధ్యక్షులుగా దరువు అంజన్న,
ఉద్యమ కళాకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చైర్మన్గా అనువోజు వెంకన్న, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నకరికంటి కిరణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గజ్వేల్ ప్రతాప్, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జువ్వాజి ప్రవీణ్, మట్టెడ కవిత, సహాయ కార్యదర్శిగా పేరాల యాదగిరి, పాలాటి రాజు, కోండ్ర కుమార్,ప్రచార కమిటీ కార్యదర్శిలుగా నకిరేకంటి చిరంజీవి, బానోతు నర్మదా, ఎండి హైమద్, గణేష్, సోషల్ మీడియా ఇన్ఛార్జిలు కొండకూరి రాజు, పాట రాజశ్రీ, పల్లికొండ దత్తు, కోల వెంకట్, సన్నీ సందీప్, సంయుక్త కార్యదర్శిలుగా గుడాల సత్యనారాయణ, పందిరి సైదులు, సిద్దిపేట శ్రీనివాస్ యాదవ్, సాంస్కృతిక కార్యదర్శిలుగా మోతె రమేష్,గంగాధర్ నాయక్,పాట మహేష్, దబిడ పుష్పలత, కొంకటి రాజేశ్వరి, పరకాల రామా, కోశాధికారులుగా ఎండి సలీం, మహంకాళి శారద, కార్యవర్గ సభ్యులుగా కలవేని కృష్ణవేణి, రానింగు సరస్వతి, అమ్రాస్ చిట్టిబాబు, డోంగ్రి సంతోష్,గణేష్, పిట్టల ఉమాపతి, శ్రీనివాస్ యాదవ్, తదితరులను ఎన్నుకొన్నారు.