

జనం న్యూస్ మే 30 చిలిపి చెడు మండల ప్రతినిధి
శుక్రవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో
ఐ సి ఏ ఆర్ శాస్త్రవేత్తలుమెదక్ జిల్లా చిల్పిచేడ్ మండలంలోని చిట్కుల్ గ్రామంలో పర్యటించి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులకు నేల యొక్క ఆరోగ్యం, మట్టి నమూనా సేకరణ మరియు మట్టి పరీక్షల వలన కలిగే లాభాలు వివరించడం జరిగింది. అలాగే వరి పంటలలో అధిక దిగుబడినిచ్చే రకాలను సూచించడం జరిగింది. సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు, సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ద్వారా రైతులకు కలిగే లాభాల గురించి చెప్పడం జరిగింది. అలాగే ప్రకృతి మరియు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల పైన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరియు రైతులకు ఎఫ్ పి ఓ స్థాపన వల్ల కలిగే లాభాల గురించి వివరించడం జరిగింది. అలాగే వరిలో వాడే వివిధ యంత్రాలను అలాగే డ్రోన్ల ఉపయోగం వలన కలిగే లాభాల పైన రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ పథకాలు గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం తునికి శాస్త్రవేత్త డాక్టర్ ఉదయ్ కుమ ఎన్ పి బి జి ఆర్ శాస్త్రవేత్తలు డాక్టరు ప్రసన్నహోలజ్జెర్ ఐ ఐ ఆర్ ఆర్ శాస్త్రవేత్త పాప రావు కౌడిపల్లి మండల ఏఈఓ కృష్ణ వేణి మరియు రైతు సోదరులు పాల్గొనడం జరిగింది