

సుగుణక్కకు ఘనంగా సన్మానించిన పార్టీ శ్రేణులు
జనం న్యూస్ మే 30 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్కను పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించారు.’సంవిధాన్ బచావో ప్రోగ్రామ్’ తెలంగాణ రాష్ట్ర కమిటీలో ఆత్రం సుగుణక్కకు చోటు లభించింది.ఈ మేరకు శుక్రవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయానికి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియిజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చి సుగుణక్కకు పూల మొక్కలను అందించి, శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా సుగుణక్క మాట్లాడుతూ పార్టీ నాకు ఇచ్చిన బాధ్యతలను వమ్ము చేయకుండా సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ ని ప్రజల్లోకి తీసుకు వెళ్ళటానికి కృషి చేస్తానని తెలిపారు. పార్టీ శ్రేణులు కూడా కష్టపడి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు.