

జనం న్యూస్ మే 30 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ)
డా.బి.ఆర్.అంభేద్కర్ కోనసీమ జిల్లా.. ముమ్మిడివరం:
ఈనెల 31 తేదీన ముమ్మిడివరం నియోజకవర్గం చెయ్యరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బంగారు కుటుంబం కార్యక్రమంలో పాల్గొనేందుకు ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చెయ్యేరు విచ్చేయుచున్న సందర్భంగా , ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి ఓఎన్జిసి సైట్లో హెలిపాడ్, చెయ్యేరు లో బహిరంగ సభ నిర్వహించే ప్రదేశాలను, చీఫ్ మినిస్టర్ ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ (క్యాబినెట్ మినిస్టర్) శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు, ముమ్మడివరం శాసనసభ్యులు(విప్) దాట్ల బుచ్చిబాబు ,జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ , ఇంటిలిజెన్స్ అధికారులు, ఎస్పీ బి.కృష్ణారావు, అమలాపురం ఆర్టీవో కే మాధవి సి అశోక్ గుత్తుల సాయి తాడి నరసింహారావు దాట్ల పృధ్విరాజ్ దాట్ల పవన్ నడింపల్లి సుబ్బరాజు తవటపెల్లి నాగు, శ్రీను, తదితరులు దగ్గరుడి పర్యవేక్షించారు
