Listen to this article

జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా జూన్ 01

పటాన్ చెరువు పట్టణ పరిధి ముదిరాజ్ భవన్ సంఘంలో పటాన్చెరు సిఐ వినాయక్ రెడ్డి మరియు ఎస్సైలు శ్రీశైలం, ఆసిఫ్, కోటేశ్వరరావు, వెంకట్ రెడ్డి,ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతి సమావేశానికి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరులు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ రానున్న జూన్ 7 తారీఖున బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కులమతాలకతీతంగా ఎలాంటి ఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత మనందరిదనీ, బక్రీద్ సందర్భంగా గోవధ చేయవద్దని, ప్రభుత్వం గోవధను నిషేధించిందని తెలిపారు. మతాలను గౌరవించుకుంటూ పండుగలను నిర్వహించుకోవాలని, శాంతియుతంగా ఆనందోత్సాహాలతో జరుపుకొని మత సామరస్యానికి పాటు పడాలని పేర్కొన్నారు. సోషల్‌మీడియాలో మత ఘర్షణలను ప్రేరేపించే వార్త ఏమైనా వస్తే నమ్మవద్దని కోరారు. చిన్న సంఘటన జరిగినా పోలీసులకు, డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని పటాన్ చేరు సీఐ వినాయక్ రెడ్డి కోరారు. అనంతరం ముస్లిం మత పెద్దల సలహాలు, సూచనలు తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ పటాన్ చేరు పట్టణంలో 55 సంవత్సరాల నుండి వినాయక చవితి,దసరా, దీపావళి,రంజాన్,బక్రీద్, క్రిస్మస్ పండుగలను కులమతాలకతీతంగా కుటుంబ సభ్యుల వాలే కలిసిమెలిసి జరుపుకుంటున్నామన్నారు.ఈ కార్యక్రమంలో పటాన్ చేరు ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జలగరి ఎట్టయ్య,బిజెపి నాయకులు, బజరంగ్ దళ్ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు, ముస్లిం పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.