Listen to this article

జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం జోగిపేట్ ఆదివారం జూన్ 1 అందోల్ నియోజకవర్గం

జోగిపేట్ లో గల డబల్ బెడ్ రూమ్ కాలనీ లో పట్టించుకునే అధికారులే లేరు, పేరుకే డబల్ బెడ్ రూమ్ లు, మొత్తం నాసిరకం పనులు, వర్షాకాలం వచ్చిందంటే పరిస్థితి అయోమయం, గత ప్రభుత్వంలో మంజూరైనటువంటి డబల్ బెడ్ రూమ్ కాలనీ లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. కాలినీలోకి రావాలంటే భయాందోళనకు గురి అవుతున్నారు. రోడ్లు సరిగ్గా లేకపోవడం, రాత్రివేళలో విద్యుత్ దీపాలు వస్తూ పోతూ ఉంటాయి. కరెంట్ ఎక్కువ తక్కువగా అవ్వడంతో ట్రాన్స్ఫారాలు సరిగ్గా పనిచేయడం లేదు. మరియు కాలనీ మొత్తం పిచ్చి మొక్కలు లేవడంతో దోమలు మరియు ఇతర విష సర్పాలు తిరుగుతున్నాయి, ఇదే అవకాశం గా తీసుకున్న దొంగలు రాత్రి వేళలో పెట్రోల్ దొంగతనాలు చేస్తున్నారు. గత మూడు సంవత్సరాల క్రితం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండడానికి ఇల్లు ఇచ్చింది, అందులో నిత్యం సమస్యలే ఎదుర్కొంటున్న ప్రజలు వర్షాకాలం రాగానే టీవీలు, ఫ్రిజ్లు కాలిపోతున్నాయంటూ పలుమార్లు లైన్మెన్ కి తెలిపిన పట్టించుకోవడం లేదు. ఇకనైనా అధికారులు తమ సమస్యలకు పరిష్కారం ఇవ్వగలరని కోరుతున్నారు.