

ఒకరిపై ఒకరు నినాదాలు..
జనం న్యూస్. మే 31. సంగారెడ్డి జిల్లా. హత్నూర. నియోజకవర్గం ఇంచార్జ్.(అబ్దుల్ రహమాన్)
హత్నూర మండలంలోని ఎల్లమ్మ గూడెం గ్రామంలో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు శంకుస్థాపన కార్యక్రమంలో బీ ఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీల మధ్య కొద్దిసేపు రసాభస నెలకొంది. ముందుగా గ్రామంలోకి వెళ్లిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కొబ్బరికాయ కొట్టే సమయంలో బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఫ్లెక్సీ ఫోటోకు అడ్డువస్తున్నారని కాంగ్రెస్ నాయకులు
అనగానే ఎమ్మెల్యే సునీత రెడ్డి కల్పించుకుంటూఫోటో కాల్ ప్రకారమే మేము నడుచుకుంటామని మీరే ప్రోటోకాల్ పాటించడం లేదని సీఎం మీకే కాదు అందరికీ సీఎం అని ఆమె బదులు ఇచ్చారు, అంతలోనే ఒకరిపై ఒకరు పోటాపోటీగా జై కాంగ్రెస్, జై బిఆర్ఎస్ అంటూ నినాదాలతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది, అనంతరం సునీతా లక్ష్మారెడ్డి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోగా, వెంటనే నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ ఫోటో లేకుండా ఇందిరమ్మ ఇండ్లను శంకుస్థాపన కార్యక్రమం ఎలా జరుపుతున్నారని అధికారులను నిలదీశారు, అనంతరం ఆవుల రాజిరెడ్డి సీఎం ఫోటోకి పాలాభిషేకం, చేసి కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోయారు.
