Listen to this article

జనం న్యూస్ జూన్ 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని పోలీస్ స్టేషన్ లో సీ ఐ పి రంజిత్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోలీస్ స్టేషన్ లో జెండా ఆవిష్కరణ జరిగింది అనంతరం సీ ఐ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాదించాడం కోసం ఎందరో అమరవీరుల త్యాగ ఫలం అని తెలంగాణా రాష్ట్ర వారి త్యాగాలను స్మరించుకుంటూ గుర్తుగా ప్రతి సంవత్సరం జూన్ 2 మనం తెలంగాణ జెండా ఆవిష్కరణ జరుపుకుంటాం అని తెలిపారు అనంతరం స్కూల్ పిల్లల కు బుక్ లు పెన్సిల్ అందజేశారు ఈ కార్యక్రమంలో శాయంపేట ఎస్సై జక్కుల పరమేష్ ఎ ఎస్ ఐ కుమారస్వామి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…