

జనం న్యూస్ 2 జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి
భీమారం మండల కేంద్రంలో ని స్థానిక పోలీస్ స్టేషన్లో సోమవారం రోజున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఎస్సై శ్వేత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ శ్వేత మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాట్లు అమరవీరుల త్యాగం మరువలేనిదని తొలి దశ ఉద్యమంలో 369 మంది ప్రాణాలు అర్పిస్తే మలిదశ ఉద్యమంలో 1200 మందికి పైగా అమరులయ్యారు 2009 డిసెంబర్ 3న శ్రీకాంత్ చారి చేసిన త్యాగం ఉద్యమ జ్వాలలను రగిలించింది మంటల్లో కాలుతూనే జై తెలంగాణ అంటూ నినాదించడం అప్పట్లో అంత పెద్ద ప్రాణత్యాగం చేయడం ఒక విధంగా రాష్ట్ర ఏర్పాటుకు తోడ్పడిందని భవిష్యత్ తరాలకు ఉద్యమ స్ఫూర్తిని నింపి అమరులైన వారి త్యాగాలను ఈరోజు స్మరించకుందాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మాచర్ల,హెడ్ కానిస్టేబుల్ ఆనంద్ పాల్, కానిస్టేబుల్ నజీర్,అశోక్, స్రవంతి, నేహాల్,హోంగార్డు లక్ష్మయ్య, భీమారం ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు కాసిపేట రవి కోశాధికారి నంది శివ జాయింట్ సెక్రెటరీ నూతి నాగరాజు కార్యవర్గ సభ్యులు నాంపల్లి చంద్రశేఖర్ పాల్గొన్నారు
