Listen to this article

జనం న్యూస్; 2జూన్ సోమవారం సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;

సిద్దిపేట పట్టణం శివాజీ నగర్ లోని బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న 4వ బాలానందం సమ్మర్ క్యాంప్ దిగ్విజయంగా ముగింపు వేడుకలను నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిద్దిపేట జిల్లా దిశా కమిటీ సభ్యురాలు తిప్పని వనజ గారు, ఘనపురం ప్రైమరీ స్కూల్ టీచర్ బస్వ రాజకుమార్ వర్మ గారు, మిమిక్రీ వై.రమేష్ పాల్గొని పోటీలలో పాల్గొన్న పిల్లలందరికీ బహుమతులను అందజేశారు, ముఖ్యఅతిథిగా విచ్చేసిన వనజ గారు మాట్లాడుతూ పిల్లలు క్యాంప్ లో ఏవైతే నేర్చుకున్నారో శ్రద్ధగా వాటిని జీవితంలో ఆచరించాలని నైతిక విలువలని, జ్ఞానం ద్వారా జీవితాన్ని ఆనందంగా సమర్థవంతంగా తీర్చిదిద్దుకోవాలని తెలియజేశారు మరియు రాజ్ కుమార్ సార్ మాట్లాడుతూ ఇలాంటి సమ్మర్ క్యాంప్ లో పాల్గొంటూ జ్ఞానాన్ని పెంచుకోవాలని అందరూ మూడు రోజుల పాటు పాల్గొన్నందుకు పిల్లలకి అభినందనలు తెలియజేశారు, మిమిక్రీ కళాకారుడు రమేష్ మ్యాజిక్ షో ద్వారా పిల్లలను అలరించారు అనంతరం సంస్థ నిర్వాహకురాలు బీ కే. భవాని మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు రోజు మెడిటేషన్ చేయడం నేర్పిస్తే పిల్లల లో హైపర్ ఆక్టివిటీ, లేజీనెస్ తగ్గి మానసిక వికాసం పెరుగుతుందని, చక్కగా చదువుకోగలుగుతారని, తల్లిదండ్రులు పిల్లలతో సమయాన్ని గడుపుతూ పిల్లల భవిష్యత్తుకు పునాది వేసే విధంగా ప్రేమను అందించాలని తెలియజేశారు, సీనియర్ సోదరులు వై .ఓం కారం మాట్లాడుతూ ఆధ్యాత్మికత అంటే ఏమిటి? దానిని ఎలా మనము రోజువారి జీవితంలో ఉపయోగించుకుంటూ ఉన్నతంగా ముందుకు వెళ్లాలో తెలియజేశారు, అనంతరం ఈ క్యాంపులో పాల్గొన్న బాలల అందరికీ పరీక్ష ప్యాడ్స్, పెన్నులు, పెన్సిళ్ల ను కానుకలుగా అందించడం జరిగింది . ఈ కార్యక్రమానికి కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు బి కే.స్వప్న, బి కే స్రవంతి, బిందు, శేషు, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.