Listen to this article

జనం న్యూస్ 02 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్‌ పల్లి నల్లనయ్య పేర్కొన్నారు.
ఆదివారం ప్రజారోగ్య సిబ్బంది పలు ప్రధాన కాలువల్లో పేరుకుపోయిన పూడికలను తొలగిస్తున్నారు. జేసీబీల సహాయంతో చెత్తాచెదారాలను తొలగించి వర్షపునీరు ప్రవాహానికి అడ్డంకి లేకుండా చేస్తున్నారు.