Listen to this article

తడ్కల్ పాఠశాల ఆవరణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం.

కేంద్ర ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేష్.

జనం న్యూస్,జున్ 02,కంగ్టి

సంగారెడ్డి కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ తల్లి చిత్రపటానికి పుష్ప మాలలు సమర్పించి టెంకాయలు కొట్టి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గేయం,తెలంగాణ రాష్ట్ర గేయాన్ని పటియించారు ఈ సందర్భంగా ప్రధాన అధ్యాపకులు వెంకటేష్, మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ పండుగ అని అన్నారు.ఈ రోజున హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అవతరణ ఉత్సవాలను జరుపుకుంటారని అన్నారు. దశాబ్దాలుగా (1969 నుంచి 2014వరకు) వివిధ దశలలో సాగిన తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు.ప్రత్యేక తెలంగాణ అంశంపై 2010లో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటై ఆరు ప్రతిపాదనలు చేసింది. ఆ ప్రతిపాదనలతో 2013,జూలై 30న ప్రత్యేక తెలంగాణ కొరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేయగా, 2013 అక్టోబరు 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదం లభించగా. 2014,ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోకసభలో,ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఆమోదం పొందిందని అన్నారు.2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ఆదేశిస్తూ,కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 (ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు,లేదా తెలంగాణ బిల్లు) ను ప్రవేశపెట్టిందని అన్నారు.2014 మార్చి1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించగా,2014 జూన్ 2వ తేదీన దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించిందని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి చాలా సంవత్సరాల నాటి చరిత్ర ఉంది.తెలుగు మాట్లాడే సమాజం యొక్క ప్రత్యేకమైన భాషాపరమైన ఆందోళనలను పేర్కొంటూ తెలంగాణ వాసులు 1952 నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదించబడిన తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రంగా అవతరించిందని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రంలో ప్రభుత్వ సెలవుదినంగా పరిగణిస్తారు.తెలుగు మాట్లాడే ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాడిన అనేక మంది తెలుగువారి త్యాగాలను స్మరించుకోవడానికి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్లు తట్టి సావిత్రి,గంగామణి, ఉపాధ్యాయిని శ్రీ వాణి, అశ్విని,ఉపాధ్యాయులు ప్రమోద్,శ్రీనివాస్,అనిల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వై మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు బ్రహ్మానంద రెడ్డి,గుర్రపు సత్యనారాయణ,తొమ్రే బాలప్ప,తట్టి వీరేశం, అంగన్వాడి టీచర్ విట బాయి,ఆయమ్మ మాణిక్యమ్మ,ఆశా వర్కర్ సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.