Listen to this article

(జనం న్యూస్ జూన్ 2 చంటి)

ఈరోజు దౌల్తాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలంగాణ జాతీయ జెండా ను మండల అధ్యక్షులు పడాల రాములు ఆధ్వర్యంలో జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా దుబ్బాక ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా సుదీర్ఘకాలం కొట్లాడే స్వరాష్ట్రం సాధించుకున్నామని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి తెలంగాణ రాష్ట్ర కలలను నెరవేర్చిన సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. అమరుల ఆశయాల ప్రజలు ఆకాంక్షలతో అనుగుణంగా ప్రజాపాలన కొనసాగిస్తున్నామన్నారు. సుమారు 21 వేల కోట్ల పైగా రుణమాఫీ చేశామని 500 సన్న వడ్లు బోనస్ 60 వేల పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని రాజీవ్ యువ వికాసం స్కీం ద్వారా ఉపాధి కల్పిస్తామని మహిళా సంఘాలకు రుణాలు ఇందిరమ్మ ఇల్లు నిరుపేద కుటుంబాలకు సొంత ఇంటి కల పునాదులు వేశామని అన్నారు. సన్న బియ్యం పంపిణీ 200 యూనిట్లు కరెంట్ ఉచిత గ్యాస్ పేద కుటుంబాలకు ఆర్థికంగా చేయూతను అందిస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఆరోగ్య విద్యా ద్వారా విద్య వైద్యం ఆర్థిక అధిగమిస్తూ అని రంగాలలో ప్రజలు ఆశలు అనుగుణంగా ముందుకు తీసుకెళ్తామని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందులో పాల్గొన్నవారు. మండలాధ్యక్షులు పడాల రాములు ఎస్సీ సెల్ అధ్యక్షులు బండారు లాలు ఉపాధ్యక్షులు మద్దెల స్వామి. మండల ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి. సంపత్ రెడ్డి కర్నాలశ్రీనివాస్. భద్రయ్య నరసింహులు. సాయిలు ఇమ్రాన్. బాలు రవి అంజి ఇందిరమ్మ కమిటీ సభ్యులు వివిధ మండలాల అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది