Listen to this article

ఎండలో చెప్పులు కుట్టుకుంటున్న వృద్ధుడికి ఆర్థిక సహాయం..

నివాస ఏర్పాటుకు ముందుకొచ్చిన పోలీసు అధికారి..

పయనించే సూర్యడు, జూన్ 2 కుమార్ యాదవ్, హుజురాబాద్ అర్ సి)

మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించారు కాజీపేట ఏసీపీ శ్రీ ప్రశాంత్ రెడ్డి. జమ్మికుంటలో పలు కార్యక్రమాలకు హాజరైన ఆయన, తిరిగి వెళ్తుండగా గాంధీ చౌరస్తాలో పేద వృద్ధుడు ఒకరు మండుటెండలో చెప్పులు కుట్టుకుంటూ కనిపించారు.వయస్సు 70 ఏళ్లు ఉన్న రాచపల్లి వెంకటయ్య అనతిది.వెంటనే వాహనం ఆపిన ఏసీపీ, ఆ వృద్ధుడి వివరాలు తెలుసుకుని ఆవేదనకు గురయ్యారు. భార్య మృతి చెందిన తర్వాత, కుమారుల పరిస్థితి కూడా నిలకడగా లేదని వెంకటయ్య వాపోయాడు.ఇల్లు లేదు సార్… చెప్పులు కుట్టుకుంటూ బస్టాండ్‌ వద్ద పడుకుంటున్నా,అన్న మాటలు ఏసీపీ మనసును తాకాయి.ఆదరించాలి అనిపించిన ప్రశాంత్ రెడ్డి, వెంటనే వ్యక్తిగతంగా రూ.2,000 ఆర్థిక సహాయం చేశారు. అంతే కాకుండా నెలకు రూ.2,000 పంపిస్తానని హామీ ఇచ్చారు. అంతటితో ఆగకుండా శాయంపేట ప్రాంత నాయకులకు ఫోన్ చేసి, వెంకటయ్య కోసం ఒక చిన్న గృహం ఏర్పాటు చేయాలని కోరారు. దానికి కావలసిన ఖర్చును తానే భరిస్తానని తెలిపారు.ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ఈ ఉదాత్తమైన చర్యకు స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.పోలీసు వ్యవస్థలో ఇటువంటి మానవీయత కలిగిన అధికారి ఉండటం ఎంతో ఆనందకరం అని జనం హర్షం వ్యక్తం చేశారు.