Listen to this article

జనం న్యూస్ 03జూన్ పెగడపల్లి ప్రతినిధి


జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని వివిధ గ్రామాలు నుండిరాబోవు ఖరీఫ్ సీజన్ కు గొలుసు కట్టు ద్వారాఅయితుపల్లి,మద్దులపల్లి,ఆరవెల్లి,బతకపల్లి, లింగాపూర్,వెంగళయపేట పెగడపల్లి మరియు నంచర్ల చెరువులకు నీరు అందించాలని అలాగే అయితుపల్లి యూటీ మరమ్మత్తుల నిర్మాణం పూర్తి చేయాలని జగిత్యాల కలెక్టరేట్లో ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ని కలిసి పెగడపల్లి ఏఎంసి చైర్మన్ మరియు మండల నాయకులు వారిని కోరగా వెంటనే ఎస్సారెస్పీ చీఫ్ ఇంజనీర్ కి అధికారిక లెటర్ రాయగా అట్టి సిఫార్సు లెటర్ ను ఎస్సార్ ఎస్పీ డి సి ఈ కి కలిసి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తడగొండ రాజు కడారి తిరుపతి పూసాల తిరుపతి చెట్ల కిషన్ పాల్గొన్నారు.