

30 సం”రాల కల గ్రామ ముదిరాజ్ పెద్దలు
జనం న్యూస్, జూన్ 3 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
జగదేవపూర్ మండలం లోని లింగారెడ్డి పల్లి గ్రామం లో చెరువులు ఉన్నప్పటికీ గ్రామంలో మత్స్యకార సొసైటీ మాత్రం లేదు. 30 సంవత్సరాలుగా ఎన్నోసార్లు రాష్ట్ర నాయకుల చుట్టూ తిరిగిన పట్టించుకున్న దాఖలు లేవ్వు.ఎలాగైనా గ్రామంలో మత్స్యకార సొసైటీ ఏర్పాటు చేయాలని పట్టుదలతో గ్రామ ముదిరాజ్ పెద్దలు,ముందుకు వచ్చి మత్స్యకార సొసైటీ ఏర్పడే విధంగా కృషి చేశారు.సోమవారం గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా మత్స్వకార అధికారి ఆర్ఎల్ దుందాయ్, జిల్లా మత్స్యకార సొసైటీ డైరెక్టర్ అక్కరం ఐలయ్య సహకారంతో లింగారెడ్డి పల్లి గ్రామం లో నూతన ప్రాథమిక మత్స పారిశ్రామిక సంఘం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సంఘంలో 18 మంది సభ్యులు పాల్గొనగా 18 కృత్తి నైపుణ్యంతో పాస్ అయ్యారు సొసైటీ మత్స్యకార సభ్యులకు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి చేతుల మీదుగా సొసైటీ పత్రాలు అందజేశారు, ఈ సందర్భంగా గ్రామ ముదిరాజ్ పెద్దలు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిక్కుడు సుధాకర్ మాట్లాడుతూ గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సరెడ్డి కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.మా గ్రామంలో చెరువులు ఉన్నప్పటికీ మా తాత ముత్తాతల కాలం నుంచి చేపలు పెంచుకుంటూ ఉపాధి పొందుతున్నప్పటికీ ఇప్పటివరకు మచ్చ పరిశ్రమిక సహకార సొసైటీ ఏర్పాటు కాలేదని చెప్పారు,ఎన్నిసార్లు మత్స్యశాఖ అధికారులను కోరిన పట్టించుకున్న పా పాన పోలేదన్నారు. రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం మన ఏర్పడిన తర్వాత మా గ్రామ ముదిరాజ్ మత్స్యకరుల ప్రాథమిక పరిశ్రామిక సంఘం ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు 77 మందికి ఇండ్లు లేని వారు ఉన్నట్లు గుర్తించామని ప్రస్తుతం వాటిలో 17 ఇండ్లు మంజూరులో ప్రాధాన్యత నిచ్చారు, అందులో 17 ఇండ్లు నిర్మాణం దశలో ఉన్నాయని ఆయన అన్నారు.ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఖాతాలో నేరుగా 1 లక్ష రూ. జమ అయ్యాయని చెప్పారు.గ్రామంలో 19 మందికి రైతు భరోసా కింద 6000/- రూ. పడ్డాయని చెప్పారు.కాంగ్రెస్ హయాంలో లింగారెడ్డి పల్లి గ్రామాన్ని జిల్లాలోనే ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని సూచించారు.ఈ కార్యక్రమంలో బస్లుకూరి శిరియాల, కరుణాకర్ కనకరాజు క్కల సతీష్,సాతేలి రాజు,ద్యాప గోపి,చెక్కల కృష్ణ ,చెక్కల చంద్రయ్య,చెక్కల శేఖర్,
భీమారి స్వామి,ద్యాప యాదగిరి,సాతేల్లి హరికిషన్, కనకయ్య , సాతెల్లి నర్సింలు,బాల్సుకురి శ్రీను,
బల్సుకూరి కుమార్, రెడ్డమైన వెంకటేష్, జహంగీర్ తదితరులు ఉన్నారు.