

రామకోటి రామరాజు కృషి పట్టుదలను కొనియాడిన
దేవాలయం చైర్మన్ బల్లి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ రాములు గౌడ్
జనం న్యూస్, జూన్ 3 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం అంగడికిష్టాపూర్ గ్రామంలోని శివాలయంలో సోమవారం నాడు భద్రాచల రామయ్య ముత్యాల తలంబ్రాలు పంపిణీ చేశారు శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు. వాటి పవిత్రత, విశిష్టత తెలియజేసి అందించారు. ఈ సందర్బంగా ఉమామహేశ్వరదేవాలయ చైర్మన్ బల్లి శ్రీనివాస్, తాజా మాజీ సర్పంచ్ దుద్దెడ రాములు గౌడ్ మాట్లాడుతూ మా గ్రామానికి భద్రాచల దేవస్థాన తలంబ్రాలు తీసుకురావడం రామకోటి రామరాజు కృషి పట్టుదల అమోఘం అన్నారు. భద్రాచల సీతారాముల కల్యానానికి మా గ్రామస్తులు రామకోటి రామరాజు ద్వారా గోటి తలంబ్రాలు అందించడం మా అదృష్టం అన్నారు. రామకోటి రామరాజును ఘనంగా సన్మానించారు. ఈరోజు కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, చారి, మైపాల్ రెడ్డి, సురేష్ పాల్గొన్నారు.
