Listen to this article

నందికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

జనం న్యూస్ – జూన్ 2- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-

నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ పోలీస్ స్టేషన్ లో ఎస్సై సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు,, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించిన నాగార్జునసాగర్ టౌన్ ఎస్సై సంపత్ గౌడ్, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి చాలా సంవత్సరాల నాటి చరిత్ర ఉందని తెలుగు మాట్లాడే సమాజం యొక్క ప్రత్యేకమైన భాష పరమైన ఆందోళనలను పేర్కొంటూ తెలంగాణవాసులు 1952 నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదించబడిన తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రంగా అవతరించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.