

జనం న్యూస్, జూన్ 3 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం వరదరాజపురం లో వెలసిన పురాతన ఆలయం శ్రీ వరదరాజస్వామి ఆలయానికి సోమవారం సౌండ్ సిస్టం విరాళంగా అందజేసిన రమణారెడ్డి ఈ సందర్భంగా వరదరాజపురం బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు లక్కాకుల నరేష్ మాట్లాడుతూ వరదరాజస్వామి కరుణాకటాక్షాలతో అందరూ బాగుండాలని కోరుకుంటూ, వరదరాజస్వామి ఆలయానికి దాదాపు 60 వేల రూపాయల విలువగల సౌండ్ సిస్టం అందజేసిన రమణారెడ్డి కుటుంబ సభ్యులకు ఆ స్వామివారి ఆశీర్వాదం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు పురుషోత్తమ చార్యులు,నర్సింలు, శ్రీపతి ప్రభాకర్,రమణ తదితరులు పాల్గొన్నారు