

టీయూడబ్ల్యూజే ( ఐ జే యూ) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్
జనం న్యూస్ జూన్ 02 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
ఆసిఫాబాద్ : తెలంగాణ స్వరాష్ట్రం కోసం అమరులైన తెలంగాణ అమరవీరుల స్ఫూర్తిగా హక్కుల సాధనకై ఉద్యమించాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం ( టీయూడబ్ల్యూజే -ఐజేయు ) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద జర్నలిస్టులు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఆశయాల సాధనకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ ప్రకాష్ గౌడ్, టీయూడబ్ల్యూజే జిల్లా కోశాధికారి ఆడప సతీష్, ఆసిఫాబాద్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వారణాసి శ్రీనివాస్ , టీయూడబ్ల్యూజే నాయకులు, జర్నలిస్టులు అబ్దుల్ హన్నన్ , సురేష్ చారి, రాధాక్రిష్ణ చారి, రావి, సయ్యద్ సొజర్ , విజయ్ తదితరులు పాల్గొన్నారు.