

పాత్రికేయుల పాత్ర మరువలేనిది
జనం న్యూస్, జూన్ 2 ( భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి )
వందలాది మంది విద్యార్థి అమరవీరుల వీరోచిత పోరాటం వల్ల,అమరుల త్యాగ ఫలితం వల్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని నర్సింగపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి కాంతి తేజ అన్నారు..సోమవారం రోజున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు..ఈ సందర్భంగా క్రాంతి తేజ మాట్లాడుతూ….. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1969లో అనేకమంది అమరులయ్యారని,మలిదశ ఉద్యమంలో సుమారు 1200 మంది విద్యార్థులు త్యాగాలు చేశారని, సకలజనులు తెలంగాణ రాష్ట్రం కోసం ఉవ్వెత్తున పోరాటం చేశారని గుర్తు చేశారు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందేనని జాతీయ పార్టీలో తీర్మానం చేసి,నిరసన కార్యక్రమాలు,ఆందోళనలు,పార్టీ ప్రజా సంఘాల ద్వారా పోరాటాలు పెద్ద ఎత్తున చేశామన్నారు..ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో పాత్రికేయుల పాత్ర మరువలేనిదన్నారు.