

జనం న్యూస్ -జూన్ 3- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ ఆదాసు నాగరాణి విక్రమ్ ఒకటవ వార్డు మాజీ కౌన్సిలర్ మంగతా నాయక్ వార్డ్ ఆఫీసర్ విజయ్ కుమార్ మున్సిపాలిటీ సిబ్బంది పరిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ వైస్ చైర్మన్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సాధించుకోవడం కొరకు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఐకమత్యంతో పోరాడి కొట్లాడి సాధించుకున్నామని తెలిపారు అమరవీరులకు జోహార్లు తెలిపారు ప్రత్యేక రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మున్సిపాలిటీ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.