Listen to this article

జనం న్యూస్ జూన్ 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్రాన్ని సుసంపన్నం చేసేందుకు ప్రభుత్వం ప్రజాపాలన చేస్తుందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. సోమవారం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుచ్చిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ, వారికి నివాళులర్పించారు. స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా, సాంకేతికంగా పురోగతి చెందుతుందని అన్నారు. సంస్కృతి సంప్రదాయాలలో పాటు పర్యావరణంలో ప్రపంచం తెలంగాణ వైపు చూస్తుందని కొనియాడారు. అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. మండల ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చల్లా చక్రపాణి, దుబాసి కృష్ణమూర్తి, వైనాల కుమారస్వామి, చిందం రవి, మసికే కుమార్, సాధు నాగరాజు, మరపెల్లి రాజేందర్, బాసని రవి, వరదరాజు, ప్రపంచ రెడ్డి, లడే రాజ్ కుమార్, పత్తి శీను, సుదర్శన్, విష్ణు, తదితరులు పాల్గొన్నారు…..