Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

వైసిపి దగా మాటలను తిప్పి కొట్టండి, ఎన్డీఏ కూటమి, లీడర్లకు మరియు కార్యకర్తలకు తెలుగుదేశం కార్యకర్తలకు విజ్ఞప్తి,ఎద్దుల సాగర్, రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎద్దుల విజయసాగర్ మాట్లాడుతూ, ycp కుంభకోణాల నుంచి ప్రజాదృష్టి మళ్లించడానికి ధర్నాల డ్రామా ఆడుతున్న జగన్ ముఠా. జగన్ ప్రభుత్వంలో తొలి ఏడాదిలోనే 10% హామీలు కూడా అమలు చేయలేదు. ఐదు సంవత్సరాలలో 85% హామీలు ఎగనామం పెట్టింది జగన్ ప్రభుత్వం.కాంగ్రెస్ ను అడ్డు పెట్టుకొని లక్షల కోట్లు దోచుకొని అదే పార్టీకి వెన్నుపోటు పొడిచిన జగన్ , శివకుమార్ స్థాపించిన వైకాపా పార్టీని కబ్జా చేసి శివకుమార్ కు వెన్నుపోటు పొడిచాడు. ఆస్తి కోసం తల్లిని, చెల్లిని గెంటివేసి కుటుంబ వ్యవస్థకే వెన్నుపోటు పొడిచాడు. మద్యపాన నిషేధం పై మాట తప్పి మడమతిప్పి విషపూరిత మద్యం పోసి పేదల ఆరోగ్యానికి వెన్నుపోటు పొడిచాడు. అన్నా కాంటీలను రద్దుచేసి పేదలకు కార్మికులకు వెన్నుపోటు పొడిచాడు, బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ సబ్ ప్లాన్ నిధులకు లక్ష కోట్లు దారి మళ్లించి సామాజిక న్యాయానికి వెన్నుపోటు పొడిచాడు, తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి రాగానే మొదటి నెలలోనే 4000 పెన్షన్ పెంచి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి మొదటి సంతకం మాట నిలబెట్టుకున్నాం.అధికారము రాగానే రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమం చేశాం, ఇప్పటికి 1200 కోట్లు ఖర్చు చేసి 20 వేల కిలోమీటర్ రోడ్లు బాగు చేశాం. 203 అన్న క్యాంటీన్లో తెరిచాం. చెత్త పనులు రద్దు చేశాం. నాయి బ్రాహ్మణుల వేతనాలకు 25000 పెంచాం. చేనేతలకు జీఎస్టీ ఎత్తివేశం. పవర్ లూమ్స్ కు 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్స్ 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇస్తున్నాం. గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపులు కేటాయించాం, స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 70% హామీలు అమలు చేశాం తెలుగుదేశం రాష్ట్ర పరిశీలకులు ఎద్దుల విజయసాగర్ అన్నారు.