Listen to this article

జనం న్యూస్ జూన్ 03 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో


తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. మండల కేంద్రంలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయం లో ఏపిఎం ముక్తేశ్వర్ తలకిందులుగా జెండాను ఆవిష్కరించారు. జెండా పూర్తిగా తలకిందులుగా ఎగిరేసి కనీసం తప్పుగా ఎగిరేశామనే ఆలోచన లేకుండా జాతీయ గీతం ఆలాపించారు. అయినప్పటికి తప్పును గుర్తించలేదు. ఐదు నిమిషాల తరువాత జెండా తలకిందులుగా ఎగిరేసామని గుర్తించి జెండాను కిందకు దింపి మల్లి జెండా ఎగురవేసాడు. జాతీయ జెండాకు ఇంత పెద్ద అవమానం జరిగిన తాను ఏమి తప్పు చేయనట్లు వ్యవహరించిన తీరుతో పలువురు అవాక్కయ్యారు. జాతీయ జెండాకు ఇంతటి అవమానం చేసిన ఏపిఎంపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని మండల వాసులు డిమాండ్ చేస్తున్నారు.