Listen to this article

జనంన్యూస్ 03. నిజామాబాదు. ప్రతినిధి.


నిజామాబాదు లో 11 వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఉదయం 7 గం లకు యోగ వాక్ ను పాలిటెక్నిక్ గ్రౌండ్లో జిల్లా ఆయుష్ నోడల్ అధికారి మరియు జిల్లా యోగ అసోసియేషన్ అధ్యక్షలు, గౌరవ అధ్యక్షులు జెండా ఊపి ప్రారంభిస్తూ క్రమ పద్ధతిలో యోగాసనములు, ప్రాణాయామము, ధ్యానము ప్రతి నిత్యము చేయడము వలన శారీరక మరియు మానసిక సమతుల్యతను పొంది వ్యాధులు రాకుండా చూసుకోగలమని, జిల్లాలో 16 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలలో యోగ షెడ్డులు నిర్మించి ప్రతి రోజు, ఇద్దరు పురుష , స్త్రీ యోగ శిక్షకుల ద్వారా శిక్షణ ఇవ్వడము జరుగుతుందని, ఈ సదవకాశాన్ని జిల్లా ప్రజలందరు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ ర్యాలీ ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా ఓల్డ్ కలెక్టరు గ్రౌండ్ వరకు జరిగినదని నోడల్ అధికారి డాక్టర్ జె.గంగదాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ మాట్లాడుతూ, వయసుకు సంబంధము లేకుండా అందరూ యోగ చేయవచ్చునని , గర్భిణీ స్త్రీలు, బీపీ, షుగర్, ఉబకాయము, గుండె జబ్బులకు యోగా సాధన చేయడము చక్కటి మార్గమని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా యోగ అసోసియేషన్ అధ్యక్షుడు యోగ ప్రభాకర్, గౌరవ అధ్యక్షులు యోగ రామచందర్, కార్యదర్శి సంగీత , యోగ గురువులు ఎచ్ శ్రీనివాస్, ఐశ్వర్య , తేజస్విని , దయానంద యోగ కేంద్ర సభ్యులు రుక్మయ్య కిషన్, భూమయ్య జిల్లా యోగ అసోసియేషన్ సభ్యులు, పతంజలి యోగ సభ్యులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు, రెడ్ క్రాస్ ప్రతినిధి తోట రాజశేఖర్, యోగ సిద్ధిరాములు , పట్టణ ప్రజలు మరియు యునాని సీనియర్ వైద్య అధికారి డాక్టర్ ఫసియొద్దిన్, ఆయుష్ డీపీఎం వందనా, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ తిరుపతి, ఆయుష్ ఫర్మసిస్ట్లు పురుషోత్తం, ఉమా ప్రసాద్, సబియా, సిబ్బంది రమేష్, భిక్షపతి, విట్టోబా యోగా ఇంస్ట్రక్టర్లు విజయ భాస్కర్, సంగీత, నమ్రతా, రాజేందర్ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినారు.కార్యక్రమములో ఆర్సపల్లి యందు గల నాలెడ్జ్ పార్క్ లో యోగనభ్యసిస్తున్న ముస్లిం సోదరులు మాట్లాడుతూ యోగ సాధనతో వారు వాడుచున్న మందులలో సగ శాతం తగ్గినవని సంతోషం వ్యక్తం చేసినారు.కలెక్టరు గ్రౌండ్ లో చేసిన బలికల యోగ విన్యాసాలు అందరినీ అబ్బుర పరచినది.
డాక్టర్ జె.గంగాదాస్pH 8099330265జిల్లా ఆయుష్ అధికారి & IYD నోడల్ అధికారి .నిజామాబాద్ జిల్లా.