Listen to this article

మద్నూర్ జూన్ 3 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం ధనుర్, సోమూర్ గ్రామంలో మంగళవారం నాడు భూభారతి సదస్సును తాసిల్దార్ ఎండి ముజీబ్ ప్రారంభించారు. ఈ భూభారతి సర్వే మండలంలో మూడవ తేదీ నుండి ఈనెల 20వ తేదీ వరకు కొనసాగుతుందని రైతులు దీన్ని సద్వినియం చేసుకోవాలని ఎంఆర్ఓ వెల్లడించారు. ధనుర్ గ్రామంలో భూభారతి దరఖాస్తులు 10 స్వీకరించడం జరిగినది. సోమూరు గ్రామంలో రైతుల నుండి 14 దరఖాస్తులు స్వీకరించారు. రెండు గ్రామాలు కలిపి మొత్తము 24 దరఖాస్తులు స్వీకరించారు. ఈ రెవెన్యూ సదస్సులో మండల తాసిల్దార్ ఎండి ముజీబ్, గిర్ధవార్ శంకర్,రవి ,ఏఎస్ఓ దత్తు, ప్రవీణ్ దశరథ్, హనుమాన్లు,సతీష్ తదితరులు పాల్గొన్నారు .