Listen to this article

జనం న్యూస్ జూన్ 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ


ముమ్మిడివరం మండలం కమినిలంక- కె.గంగవరం మండలం శేరిలంక సమీప గోదావరి ప్రాంతంలో స్నానానికి దిగిన 8 మంది యువకులు మరణించిన ఘటనలో మృతుల కుటుంబాల వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 లక్షల రూపాయలు ఆర్దిక సహాయం ప్రకటించిన విషయంలో మన నియోజకవర్గంలో ఐ పోలవరం మండలం జి.మూలపోలం ఎర్రగరువు గ్రామానికి చెందిన వడ్డి మహేష్‌(16) వడ్డి రాజేష్‌(14) ఇద్దరూ అన్నదమ్ములు మరణించడం జరిగినది. ఈ ఘటనలో మరణించిన వార్కి ఒక్కొకరికి 2 లక్షల రూపాయలు చొప్పున 4 లక్షల రుపాయల చెక్కులను కుటుంబ సభ్యులకు ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసన సభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు అందచేసారు, ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరం అని భాదిత కుటుంబాల వారికి ప్రగాడ సంతాపం తెలియచేసారు. నాగిడి నాగేశ్వరరావు గుత్తులు సాయి తాడి నరసింహం దాట్ల బాబు కూటమి సభ్యులు వీరి సమక్షంలో చెక్కులు అందజేసినారు