Listen to this article

భూ సమస్యల పరిష్కారానికి గొప్ప వేదిక భూభారతి నూతన రెవెన్యూ చట్టం

జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు

జనం న్యూస్ జాన్ 04(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)

రెవిన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అన్నారు. మంగళవారం మునగాల మండలం కోక్కిరేణి, చిలుకూరు మండలం కొండాపురం గ్రామాలలో జరుగుతున్న రెవిన్యూ సదస్సులో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ..
తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసే విధంగా కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి చట్టం అమలులో భాగంగా మంగళవారం జూన్ 3 నుంచి జూన్ 20 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సదస్సుల ద్వారా భూభారతి చట్టంని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పారు. రెవెన్యూ అధికారులు మానవీయ కోణంలో భూ సమస్యలను పరిష్కరించాలని సూచించారు.ఏప్రిల్ 14న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చినట్టుగా గుర్తుచేశారు. ఆ తర్వాత మొదటి దశలో ఏప్రిల్ 17 నుంచి రాష్ట్రములోని 4 మండలాల్లో పైలెట్ ప్రాజెక్ట్ గా , రెండో దశలో మే 5 నుంచి జిల్లాకి ఒక మండలం పైలెట్ ప్రాజెక్ట్ లో భాగంగా గరిడేపల్లి మండలంలో 11 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుండి దగఖాస్తులని స్వీకరించామని తెలిపారు.అట్టి ధరఖాస్తులు క్షేత్ర స్థాయి లో పరిశీలించి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ ఈ సందర్బంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్డివో సూర్యనారాయణ, తహసీల్దార్లు రామకృష్ణ రెడ్డి, ధ్రువకుమార్,అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.