

ఉపాధి హామీ కూలీల ఆవేదన.
జనం న్యూస్ 4 జూన్ : భీమారం మండల ప్రతినిధి. ( కాసిపేట రవి )
మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని గ్రామపంచాయతీలలో గత ఏప్రిల్ నెల నుండి ఉపాధి హామీ కూలి పనులు చేస్తున్నప్పటికీ ఇంతవరకు ఉపాధి హామీ వేతనాలు బ్యాంక్ ఖాతాలలో పడటం లేదని గ్రామపంచాయతీ కూలీలు వాపోయారు. ఉపాధిహామీ చట్ట ప్రకారం పని చేసిన రెండు వారాలలోపే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కార్మికులకు ఖాతాలలో డబ్బులు జమ చేయాల్సింది ఉండగా ఇంకా డబ్బు జమ చేయకపోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని ఉపాధి హామీకార్మికులకు న్యాయం చేయాలని, సకాలంలో ఉపాధి హామీ కూలీలకు వేతనాలు చెల్లించాలని ఉపాధి హామీ కార్మికులు వేడుకున్నారు.
