Listen to this article

జనం న్యూస్ జూన్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం ధ్యానంతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుంది శ్రీ రామచంద్ర మిషన్ సంస్థ కోఆర్డినేటర్ ఎం శారద అన్నారు శాయంపేట మండల కేంద్రంలోని నవోదయ పాఠశాలలో శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ పుల్ నెస్ సంస్థ వారి ఆధ్వర్యంలో ఉచిత యోగ ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగ ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు మనసు ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు మనిషి తన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు నిత్యం స్నానము ఎలా అవసరమో మనసుని హృదయాన్ని స్వచ్చంగా ఉంచుకునేందుకు ధ్యానం అవసరం అని తెలిపారు విద్యార్థులు ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పెరిగి జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ రామచంద్ర మిషన్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ అచ్చయ్య రమేష్ రాంబాబు సత్యనారాయణ సుధాకర్ సురేందర్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు…..