Listen to this article

జనం న్యూస్ జూన్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినోత్సవంగా నిర్వహించుకోవాలని వైకాపా అధ్యక్షుడు జగన్ రెడ్డి పిలుపునివ్వడం హాస్యాస్పదమని ప్రభుత్వం విప్ స్థానిక శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే కూటమి ప్రభుత్వం సుమారు 70 శాతం పైగా హామీల అమలు చేసిందని, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ సమిష్టి కృషి తో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నామని అదే జగన్ రెడ్డి హయాంలో 2019- 24 మధ్య అన్ని వర్గాల్ని ప్రజలను నయవంచనకు గురిచేసిన అతిపెద్ద వెన్నుపోటు దారుడు జగన్ రెడ్డి అని పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూడలేక ఇటువంటి అనవసరపు కార్యక్రమాల్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలనుకుంటున్నారని అయితే ప్రజలే వీరిని తరిమికొడతారని అది వారు గ్రహించుకుంటే మంచిదని హితవు పలికారు.ఒక ముమ్మిడివరం నియోజకవర్గంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 200 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టమని అన్న క్యాంటీన్లు,ఇంటింటికి రేషన్ సరఫరా, మత్స్యకార భరోసా, సిసి రోడ్లు, వాటర్ ట్యాంకుల నిర్మాణం, సబ్స్టేషన్ ల నిర్మాణం, వంటి అనేక కార్యక్రమాలు కేవలం 10 నెలల కాలంలో చేసి చూపించామని అదే గత వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాలలో ముమ్మిడివరం నియోజకవర్గానికి చేసింది శూన్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంగాని వెంకటేష్,సాగిరాజు సూరిబాబు,పాయసం చిన్ని,కాకర్లపూడి రాజేష్,శేఖర్రాజు తదితరులు పాల్గొన్నారు.