

జనం న్యూస్ జూన్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని సాధనపల్లి గ్రామంలో ముదిరాజులు తమ ఆరాధ్యదైవం పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడు మిట్టపల్లి సతీష్ యువతకు ఎంతో ఆదర్శంగా ఉండి దేవాలయం ప్రతిష్టించే పెద్దమ్మతల్లి, పోతరాజుల విగ్రహాల కోసం రూ. లక్ష రూపాయలు అందజేశారు. ఈ మేరకు మంగళవారం రాత్రి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చిందం రవి, గ్రామస్తుల ఆధ్వర్యంలో సతీష్ విగ్రహాలను కొనుగోలు చేసి, గ్రామంలో ఊరేగింపు చేశారు. ఈనెల 6న విగ్రహాల ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నారు. గ్రామంకోసం పాటు పడుతున్న సతీష్ ను బుచ్చిరెడ్డి, చిందం రవి, గ్రామస్తులు హృదయపూర్వకంగా అభినందించారు, పెద్దమ్మ తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు….