

లేనిపక్షంలో డి ఎఫ్ ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తాం
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్
జనం న్యూస్ జూన్ 04 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కుమురం బీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన మండల కేంద్రంలో ఫారెస్ట్ నర్సరీలో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్లో ఉన్న (సంవత్సరం క్రితం) వేతనాలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. బుధవారం రోజున రెబ్బెన మండల కేంద్రంలోని ఫారెస్ట్ నర్సరీ కార్మికులతో కలిసి మాట్లాడుతూ గతంలో రెబ్బెన నర్సరీ లో పని చేయించిన ఎఫ్ ఎస్ ఓ (కొమ్మల్) సంవత్సర కాలం నుంచి పని చేసిన దానికి వేతనాలు చెల్లించడం లేదని అనేకసార్లు పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని ఫారెస్ట్ అధికారులకు,డిఎఫ్ఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని. అయినప్పటికీ ఫారెస్ట్ అధికారులు రేపు,మాకు అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప వేతనాలు చెల్లించడం లేదని అన్నారు కొంతమంది అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నారని,చాలా కుటుంబాలు పస్తులు ఉంటున్నరని అన్నారు.అధికారులు స్పందించి వేతనాలు చెల్లించకుంటే కార్మికులు రోడ్డుమీద అనే అవకాశం ఉందని అన్నార, ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో డిఎఫ్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఇస్తామని అన్నారు