

జనం న్యూస్ జనవరి 5 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
కూకట్పల్లి నియోజకవర్గం, కూకట్పల్లి గ్రామంలో వెంచేసివున్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం యొక్క కమిటీని ఏర్పాటు చేసిన కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ ని వారి నూతన కార్యాలయంలో కైతలాపూర్ రోడ్ కలిసి శాలువా, పూలమాలతో సత్కరించి కృతఙ్ఞతలు తెలిపిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ది కమిటీ సభ్యులు. గొట్టిముక్కల వెంకటేశ్వర రావు ని కూడా సన్మానించి కృతఙ్ఞతలు తెలుపడం జరిగింది. ఈ కార్యాక్రమంలో మాధవరం శ్రీనివాస్ రావు టాకిల్ మేకల సుదర్శన్, చెదురుపల్లి శ్రీనివాస్ గౌడ్, గొండ్లల రవీందర్ గౌడ్, తీగల కృష్ణారావు, ముసలి బాలరాజ్, గుత్తికొండ వెంకట్రావు, అంకెనపల్లి రమేష్, అరిగే శ్రీనివాస్, చేరుకుల రాజు యాదవ్, తూర్పటి కృష్ణవేణి, ఉప్పల విద్యాకల్పన, భాషిపాక నాగమణి తదితరులు పాల్గొన్నారు.
