Listen to this article

జనం న్యూస్ జూన్ 5 కూకట్పల్లి జోన్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి

అడ్వకేట్ వాసుదేవుడు మరియు మెగా అభిమానుల సమక్షంలో ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం విజయానికి సూచికగా జూన్ నెల 14వ తారీకున రమ్య గ్రౌండ్ నందు జరుగు రక్తదాన శిబిరం మరియు పండ్ల మొక్కల పంపిణీ కార్యక్రమ బ్యానర్ ని కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ మమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించబడినది. ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు అందే శ్రీరామ మూర్తి , దాసరి రంగారావు జనసేన నాయకులు, కలికినీడి ప్రసాద్, డి.రవీంద్రనాథ్ ఠాగూర్, పోలేబోయిన శ్రీనివాస్, పులగం సుబ్బు , అడబాల షణ్ముఖ, గడ్డం వీర,అశోక్,సుబ్బు,అనిత గాలి , యాళ శిరీష మరియు వాసుదేవుడు మిత్రబృందం పాల్గొన్నారు.