Listen to this article

జనం న్యూస్ జూన్ 5 కూకట్పల్లి జోన్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి

ఈరోజు కూకట్ పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్ – వివేకానంద నగర్ లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన కమిటీ సభ్యులు పులి గోళ్ళ శ్రీనివాస్ యాదవ్, ఏడుకొండలు, శ్రీనివాస్,ప్రకాష్, ముకుంద రామారావు ఆహ్వానం మేరకు కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ శ్రీ భూనీళా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 13వ వార్షిక మహోత్సవ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజలలొ పాల్గొని తీర్థప్రసాదాలు అందుకున్నారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్ ,కలిగినీడి ప్రసాద్,పవన్ నాయుడు, రామకృష్ణ, పోలే బోయన శ్రీనివాస్ ,పులగం సుబ్బు తదితరులు పాల్గొన్నారు.