

జనం న్యూస్- జూన్ 5- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డిని ఈరోజు ఉదయం ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలపై వినతి పత్రం అందజేసిన మస్జిద్ కమిటీ మరియు ముస్లిం మైనారిటీ కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక గౌతమ బాలవిహార్ నుంచి మసీదు వరకు ఉన్న బీటీ రోడ్డు గుంతల మయంగా మారి నమాజ్ కు వెళ్లే సమయంలో ముస్లిం సోదరులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని కావున సిసి రోడ్డు నిర్మించాలని కోరామని తెలిపారు, అలాగే పేద ముస్లిం యువతకు రాజీవ్ యువ వికాసంలో భాగంగా లోన్లు అందే విధంగా చూడాలని పేద మైనార్టీ ముస్లింలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యే విధంగా చూడాలని ఎమ్మెల్యేని కోరినట్టుగా కమిటీ సభ్యులు తెలియజేశారు ఈ విషయమే ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి సానుకూలంగా స్పందించి సీసీ రోడ్డు త్వరితగతిన నిర్మించి సమస్యను పరిష్కరిస్తామని, పేద ముస్లిం మైనార్టీలకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లుగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు హఫీజ్ సాబ్ ,మోజాన్ సాబ్, జానకి రెడ్డి ,షబ్బీర్ ,ముజ్జు బాయ్, నజీర్, రహమత్ అలీ ,గని ,సాదిక్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
