Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

నందలూరు మండలంలో పర్యటిస్తూ టిడిపి నాయకులు హరి ఆహ్వానం మేరకు కుంపినిపురం గ్రామం నందు చెరువుపల్లి వరుడు ప్రసాద్ వధువు సుకన్యల వారి స్వగృహం నందు పచ్చని పెళ్లి పందిరిలో మూడుముళ్ల బంధంతో నేడు ఒక్కటవుతున్న నూతన వధూవరులు ఇద్దరినీ పసుపుపచ్చని అక్షంతలు వేసి వారిని రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు ఆశీర్వదించి దీవించడం జరిగినది. అనంతరం నూతన దంపతులు ఇద్దరు చమర్తి ఆశీర్వాదం తీసుకోవడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఆయన వెంట టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి రేవూరి వేణుగోపాల్, నందలూరు క్లస్టర్ ఇంచార్జ్ పసుపులేటి ప్రవీణ్ కుమార్, యువ నాయకులు ఆనంద్, కుంపిణీపురం సర్పంచ్ చుక్కయానాది, రెడ్డి శేఖర్, శివ , భాస్కర్ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.