

జనం న్యూస్ జూన్ 5 ముమ్మిడివరం ప్రతినిధి
అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపుమేరకు జూన్ 5 నుండి ఆగష్టు 15 లోగా ప్రతిఒక్కరూ తమ మాతృమూర్తి పేరిట ఒక మొక్కను నాటీ దానిని పరిరక్షించాలని బీజేపీ , నేషనల్ పార్టీ ఆదేశాల వరకు స్టేట్ పార్టీ పిలుపునిచ్చారు. పార్టీ పిలుపు మేరకు, బిజెపి రాజానగరం అసెంబ్లీ కన్వీనర్ నీరు కొండ వీరన్న చౌదరి కర్ణాటక స్టేట్ మంగుళూరు లో ఆయన తన తల్లి పేరుట మొక్క నాటారు. తొలుత ఆమె చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మొక్క నాటి దేశ ప్రజలంతా ఇదే విధంగా తమకు నచ్చిన ప్రదేశాల్లో మొక్కలు నాటి పర్యావరణ హితానికి పాటు పడాలని కోరారు. వీరన్న చౌదరి అన్నారు
వృక్షో రక్షిత రక్షితః

