

జనం న్యూస్ : 5 జూన్ గురువారం సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై .రమేష్ :
పర్యావరణ దినోత్సవం సందర్భంగా బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యంలో “అమ్మ కోసం ఒక మొక్క ను నాటాలి” అన్న నినాదంతో ఈ సంవత్సరం పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము, ఈ కార్యక్రమంలో భాగంగా సంస్థ నిర్వాహకురాలు బి కే భవానీ మొక్కను నాటారు అనంతరం వారు మాట్లాడుతూ కరోనా సమయంలో మనకు ఆక్సిజన్ లభించక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు మళ్లీ అలాంటి పరిస్థితి రాకూడదు అంటే మనమందరము ప్రకృతిని, భూమాతను కాపాడుకోవాలి, అప్పుడే మన భవిష్యత్తు తరాల వాళ్లు హాయిగా జీవించగలుగుతారని దానికోసం ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని తెలియజేస్తూ సంస్థ సభ్యులందరికీ కూడా పూల, పండ్ల మొక్కలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు బి కే స్వప్న, బికే. స్రవంతి సంస్థ సభ్యులు పాల్గొన్నారు